
బైక్ అదుపుతప్పి వైద్యుడు..
తరిగొప్పుల: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్పై తిరిగి మంచిర్యాలకు వస్తుండగా రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నాడు. దీంతో అతడి తల, ఛాతి భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు.