టేకు కలప పట్టివేత | - | Sakshi
Sakshi News home page

టేకు కలప పట్టివేత

Oct 10 2025 6:36 AM | Updated on Oct 10 2025 6:36 AM

టేకు కలప పట్టివేత

టేకు కలప పట్టివేత

ఇచ్చోడ: మండలంలోని బావోజిపేట్‌ అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను గురువారం తెల్లవారుజాము టైగర్‌జోన్‌ అటవీ అధికారులు పట్టుకున్నారు. కొందరు స్మగ్లర్లు ఎడ్లబండ్లపై అటవీ ప్రాంతం నుంచి టేకు కలప తరలిస్తున్నారని సమాచారంతో బేస్‌ క్యాంప్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. స్మగ్లర్లు వారిని గమనించారు. కలప తరలిస్తున్న బండ్లను అక్కడే వదిలి ఎడ్లతో పరారీ అయినట్లు సిరిచెల్మ సెక్షక్షన్‌ అధికారి రాకేశ్‌ తెలిపారు. పట్టుకున్న కలప విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement