ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శంకర్‌ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శంకర్‌

Sep 24 2025 7:53 AM | Updated on Sep 24 2025 7:53 AM

ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శంకర్‌

ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా శంకర్‌

ఆదిలాబాద్‌: బాసర పుణ్య క్షేత్రానికి ఈనెల 29న ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యే క బస్సులు నడపనున్నట్లు ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజిన ల్‌ మేనేజర్‌ ఎస్‌.భవానీ ప్రసాద్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరస్వతిదేవి జన్మదినం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలోని భక్తుల సౌకర్యార్థం ఆరు డి పోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. రీజియన్‌ పరిధిలో ఎక్కడి నుంచి అయినా 30 మంది భక్తులు ఒకే చోట గ్రూపుగా ఉంటే డిపో మేనేజర్లను సంప్రదించి బస్సులను ప్రత్యేకంగా బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ డిపో ల పరిధిలో 9959226002, నిర్మల్‌ 99592 26003, భైంసా 9959226005, ఆసిఫాబాద్‌ 9959226006, మంచిర్యాల 9959226004 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

మంచిర్యాలటౌన్‌: వాలీబాల్‌ అసోసియేషన్‌ ఉ మ్మడి జిల్లా అధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన నల్ల శంకర్‌, కార్యదర్శిగా మైలారం శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమేశ్‌, హనుమంతరెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో మంగళవారం రాష్ట్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాలీబాల్‌ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.

29న బాసరకు ప్రత్యేక బస్సులు

యువకుడిపై కేసు

మంచిర్యాలక్రైం: బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్ప డిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు షీ టీమ్‌ ఎస్సై హైమ తెలిపారు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ యువకు డు, యువతి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఆతర్వాత యువకుని ప్రవర్తనలో మార్పు రావడంతో యువతి దూరం పెట్టింది. జీర్ణించుకోలేని యువకుడు గతంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను చూపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు షీ టీమ్‌ను ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆర్జీయూకేటీలో ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం

బాసర: బాసర ఆర్జీయూకేటీలో మంగళవారం 56వ ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్‌ మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పాత్ర విశిష్టమైనదన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సేవా దృక్పథం పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా మహిళా సాధికారతపై రూపొందించిన నృత్యనాటిక, బాల కార్మిక నిర్మూలనపై ప్రదర్శించిన నాటకం అందరి మనసులను కదిలించాయి. ఈ ప్రదర్శనలు సమాజంలో సున్నితమైన సమస్యలపై అవగాహన కలిగించడంతో పాటు యువతలో సామాజిక బాధ్యతను మేల్కొలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement