
జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
నస్పూర్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నస్పూర్లో అండర్–16 బాలబాలికల జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపికై న జట్లు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామంలో నిర్వహించే 35వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ రాంచందర్, కార్యవర్గ సభ్యుడు కే.కార్తీక్, అకాడమీ చైర్మన్ పెంచాల శ్రీధర్, వ్యాయమ ఉపాధ్యాయులు రవీంద్ర, కిషన్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
బాలికల జట్టు : కే.నిరీక్ష, వేదన సాయి, ఎం.అనన్య, పి.అనిత, జే.అరుణ్జ్యోతి, బి.రజిత, శ్రీసంజన, ఆనందన, సుస్మిత, కార్తీకప్రణవి, చంద్రస్మిత, కీర్తన, మనస్విక, మానస, సాహితీ, అక్షయ, పావని, రిశ్విత, సునంద, అక్షయ.
బాలుర జట్టు: రఘువర్థన్, హరికృష్ణ, యశ్వంత్, రాజ్కుమార్, చైతన్య, ఉదయ్, అనిల్కుమార్, జ శ్వంత్, హర్షిత్, సాయిరిషిత్, వినయ్, రిషికుమార్.