జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): భారతీయులు ఆరాధించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆల్ మే వా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షేక్ ఫారుక్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ప్రధాన గేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించి న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా బక్రీద్ పండుగ వస్తుందంటేనే మహబూబ్నగర్ జిల్లాలో గోవులను సంతలో అమ్ముతారని ఆ సంతలో కొనుగోలు చేసిన ఖురేషి తెగవారిపై గోరక్షక దళాల పేరుతో దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు బనాయించి వారికి నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం గోవులు సంతలో అమ్మకుండా పటిష్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు ఖురేషి తెగవారికి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మొహమ్మద్ తక్హుద్దీన్, మొహమ్మద్ సలీం మహమ్మద్ సోహెబ్ తదితరులు పాల్గొన్నారు.


