
కోయిల్సాగర్లోపెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర/ చిన్నచింతకుంట: కోయిల్సాగర్లో నీటిమట్టం ఆదివారం సాయంత్రం వరకు 24.6 అడుగులకు చేరింది. జూరాల నుంచి కేవలం ఒక పంపును రన్ చేసి 315 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రెండు పంపులు రన్ చేస్తే 630 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం ఉంది. దీంతో కాల్వల ద్వారా నీటిని వదిలిన ప్రాజెక్టు నీటిమట్టం వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. స్థానికంగా కురుస్తున్న వర్షాలతో బండర్పల్లి చెక్డ్యాం నుంచి ఆదివారం అలుగు పారింది. చెక్డ్యాం వల్ల చుట్టు పక్కల ఉండే గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.