కొలువుదీరిన జంపన్న
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలోని జంపన్నవాగు గద్దైపె జంపన్న మంగళవారం రాత్రి కొలువుదీరాడు. సమ్మక్క కుమారుడు అయిన జంపన్నను కన్నెపల్లిలోని పోలెబోయిన వంశస్తుల ఇంటినుంచి పడిగరూపంలో సాయంత్రం 6 గంటలకు పూజారులు పోలెబోయిన శ్రీను, సురేశ్తోపాటు మరికొంతమంది కలిసి డోలువాయిద్యాలతో బయలుదేరారు. ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. ఆదివాసీ యువత రోప్పార్టీతో రాత్రి 8 గంటలకు గద్దె వద్దకు తీసుకు వచ్చి పూజలు చేసి ప్రతిష్ఠించారు. మంత్రి సీతక్క వాగు వరకు జంపన్న వెంట తోడుగా వచ్చారు. జంపన్నను గద్దైపెకి తీసుకొస్తున్నప్పుడు దారి పొడవునా భక్తులుబారులుదీరి మొక్కులు చెల్లించారు.
కొలువుదీరిన జంపన్న


