ఆటో బోల్తా .. డ్రైవర్ మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
సంగెం: ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని షాపూర్లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ కరీమాబాద్కు చెందిన చామకూర రవి(45), తోట చేరాలు, ఎడ్ల శ్రీధర్ మండలంలోని షాపూర్కు వచ్చి కిరాణసామగ్రి అన్లోడ్ చేసి తిరిగి వెళ్తున్నా రు. ఈ క్రమంలో పల్లె ప్రకృతి వనం సమీపంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలో బోల్తా ప డింది. ఈ ఘటనలో డ్రైవర్ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. చేరాలు, శ్రీధర్ తీ వ్రంగా గాయపడడంతో ఎంజీఎం తరలించినట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు.


