ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

Nov 17 2025 3:47 PM | Updated on Nov 17 2025 3:47 PM

ముగ్గ

ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

హన్మకొండ: జగిత్యాల సర్కిల్‌లోని జగిత్యాల టౌన్‌–1 సెక్షన్‌ కార్యాలయంలో మద్యం తాగిన ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగులను యాజ మాన్యం సస్పెండ్‌ చేసింది. సదరు కార్యాలయంలో మద్యం విందు చేసుకున్నట్లు విచారణలో నిర్ధారణ కావడంతో అసిస్టెంట్‌ లైన్‌మెన్లు ఎ.ప్రభాకర్‌, జి.బాలకృష్ణ, వి.రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేస్తూ జగిత్యాల డివిజన్‌ డీఈ గంగారాం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై ఎన్పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి స్పందిస్తూ విధులు నిర్వర్తించే ప్రదేశంలో ఉద్యోగులు క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. విధుల నుంచి తక్షణమే తొలగిస్తామని తెలిపారు. ఈ మేరకు మెమో జారీ చేశారు. ప్రతీ ఉద్యోగి బాధ్యతతో వ్యవహరించాలని, సంస్థ ప్రతిష్టను కాపాడాలని, విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్నారు.

మొక్కజొన్న లోడ్‌ కోసం వెళ్తూ.. మృత్యుఒడికి

ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడి మృతి

బాలాజీతండా సమీపంలో ఘటన

గార్ల: మొక్కజొన్న లోడ్‌ కోసం వెళ్తూ ఓ యువకు డు మృత్యుఒడికి చేరా డు. ట్రాక్టర్‌ బోల్తా పడి మృతి చెందాడు. ఈ ఘ టన మండలంలోని బా లాజీతండా సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై సాయికుమార్‌ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మంగళితండాకు చెందిన తేజావత్‌ నాగేందర్‌(27)కు గార్ల మండలం బాలాజీతండా శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఇందులో మొ క్కజొన్న సాగుచేశాడు. పంటను ఆదివారం ట్రాక్టర్‌లో ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం మరో లోడ్‌ కోసం వస్తుండగా బాలాజీతండా శి వారులో ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌ ఆ యువకుడిపై పడడంతో తీవ్రగా యాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని హుటా హుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కూతు రు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

అపార్ట్‌మెంట్‌లో చోరీ

రూ.1.30 లక్షల విలువైన రెండు లాప్‌టాప్‌లు, 3వాచ్‌లు అపహరణ

ఖిలా వరంగల్‌ : అపార్ట్‌మెంట్‌లోని తాళం వేసి ఉన్న ఓ ప్లాట్‌లో దుండుగులు చోరీకి పాల్ప డ్డారు. బీరువాలో ఉన్న రూ.1.30లక్షల విలు వైన రెండు లాప్‌టాప్‌లు, మూడు వాచ్‌లు ఎత్తుకెళ్లారు. మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ రామ్‌ కీ ఎన్‌క్లేవ్‌ సమీపంలోని హంస కాకతీయ అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌కు యజమాని ఇంద్రనీల్‌ చటర్జీ తా ళం వేసి ఊరెళ్లారు. గమనించిన దుండగులు శ నివారం అర్ధరాత్రి ప్రధాన ద్వారం తాళం ధ్వంసం చేసి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో ఉన్న రెండు లాప్‌ టాప్‌లు, మూడు వాచ్‌లు అపహరించుకెళ్లారు. ఆదివారం ఇంటికి చేరుకున్న చటర్జీ కుటుంబ సభ్యులు తాళం ధ్వంసమై ఉండడం చూసి ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోకి వెళ్లి గమనించి చోరీ జరిగి నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌, ఎస్సై సురేశ్‌ ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుడు చటర్జీ ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రమే శ్‌ ఆదివారం తెలిపారు.

ముగ్గురు విద్యుత్‌  ఉద్యోగుల సస్పెన్షన్‌  
1
1/1

ముగ్గురు విద్యుత్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement