ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలి

Sep 18 2025 11:14 AM | Updated on Sep 18 2025 11:14 AM

ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలి

ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలి

డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు

తొర్రూరు: ఉపాధిహామీ పనులు పారదర్శకంగా చేపట్టాలని డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజు అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఉపాధిహామీ పనులపై ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. 2024–25లో మండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన ఉపాధిహామీ పనులపై సమీక్ష నిర్వహించారు. మండలంలో రూ.3 కోట్ల విలువ చేసే 277 ఉపాధిహామీ పనులు జరగగా, దానికి సంబంధించిన నివేదికలను చదివి వినిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌డీఓ మాట్లాడుతూ.. ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. జాబ్‌ కార్డు కలిగిన పేదలకు పని చూపించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, అంబుడ్స్‌మెన్‌ ఆడమ్‌, విజిలెన్స్‌ కోఆర్డినేటర్‌ మన్మోహన్‌రెడ్డి, ఏపీఓ మధు, ఎస్‌ఆర్‌పీ కవిత, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement