ఖాతానుంచి రూ.99,600 మాయం | - | Sakshi
Sakshi News home page

ఖాతానుంచి రూ.99,600 మాయం

Sep 13 2025 11:26 AM | Updated on Sep 13 2025 11:26 AM

ఖాతాన

ఖాతానుంచి రూ.99,600 మాయం

ఖానాపురం : బంగారం కుదువ పెట్టి తీసుకున్న నగదు ఖాతానుంచి మాయమైంది. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బాలుతండాకు చెందిన గుగులోత్‌ ఈరు బంగారాన్ని తీసుకెళ్లి బుధవారం నర్సంపేట పట్టణంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కుదువ పెట్టి రూ.2.60 లక్షల రుణం తీసుకున్నాడు. గురువారం నగదు విత్‌డ్రాకు అనుమతి ఇవ్వకపోవడంతో తనకున్న మరో ఏపీజీవీబీకి బదిలీ చేయించుకున్నాడు. బీఓఐలో బంగారం ఇచ్చినట్లు రశీదు తీసుకోవడానికి రూ.260 చెల్లించాలని బ్యాంక్‌ ఉద్యోగి తెలిపాడు. దీంతో క్యూఆర్‌ కోడ్‌తో చెల్లించి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత చిట్టీ చెల్లించడానికి రూ. 13వేలు, పెట్రోల్‌ కోసం రూ.200 ఖాతా నుంచి వినియోగించాడు. సాయంత్రం కుటుంబ స భ్యులు ఈరు సెల్‌కు వచ్చిన మెసేజ్‌లు చూ డటంతో పలు దఫాలుగా రూ.99,600 ఖా తాలో నుంచి వి త్‌డ్రా అయినట్లు గమనించారు. దీంతో భయాందోళనకు గురైన ఈరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చెల్పూరులో చైన్‌ స్నాచింగ్‌

బంగారు పుస్తెలతాడు అపహరణ

గణపురం: మండలంలోని చెల్పూరులో గురువారం అర్ధరాత్రి చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. చెల్పూరుకు చెందిన వృద్ధురాలు కౌటం మొండక్క మూత్రవిసర్జనకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడకు వెంట తెచ్చుకున్న టైరును వేసి బంధించాడు. ఒక చేతితో నోటిని మూసి ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. ఆమె అరుపులు విన్న భర్త మొగిలయ్య బయటకు రావడంతో అప్పటికే దుండగుడు పారిపోయాడు. మెడ ను ంచి పుస్తెల తాడు తెంపే క్రమంలో మొండక్క మెడకు గాయాలయ్యాయి. భర్త మొగిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్‌ పేర్కొన్నారు.

వరుస చోరీలతో ఆందోళన..

గతనెలలో కూడా చెల్పూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు నరహరి కమలమ్మను ఇంటి వద్ద దింపుతానని గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలును లాక్కెళ్లాడు. ఈ ఘటన జరిగి నెలగడవక ముందే గురువారం అర్ధరాత్రి చైన్‌ స్నాచింగ్‌ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలను ప్పాడుతున్న వారు స్థానికుల లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా అని గ్రామస్తులు భయపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని పోలీసులు ధైర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ముగిసిన కబడ్డీ టోర్నమెంట్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఇంటర్‌ కాలేజీయేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్‌ శుక్రవారం ముగిసింది. ఫైనల్‌లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కాలేజీ జట్టు విజయం సాధించింది. హనుమకొండలోని వాగ్దేవి కళాశాల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఇరు జట్లకు కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్‌ వై.వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ టి. మనోహర్‌ బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎస్‌. కుమారస్వామి, ఫిజికల్‌ డైరెక్టర్లు సోమన్న, జేత్య, కిరణ్‌కుమార్‌, పాషా, పల్లవి, బుచ్చన్న, సుమన్‌, అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖాతానుంచి రూ.99,600 మాయం1
1/2

ఖాతానుంచి రూ.99,600 మాయం

ఖాతానుంచి రూ.99,600 మాయం2
2/2

ఖాతానుంచి రూ.99,600 మాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement