వనదేవతలను దర్శించుకున్న వైస్‌చాన్స్‌లర్లు | - | Sakshi
Sakshi News home page

వనదేవతలను దర్శించుకున్న వైస్‌చాన్స్‌లర్లు

Sep 4 2025 10:49 AM | Updated on Sep 4 2025 10:49 AM

వనదేవతలను దర్శించుకున్న వైస్‌చాన్స్‌లర్లు

వనదేవతలను దర్శించుకున్న వైస్‌చాన్స్‌లర్లు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మను బుధవారం ఐదు రాష్ట్రాలకు చెందిన వివిధ యూనివర్సిటీల వైస్‌ చాన్స్‌లర్లు (వీసీ) దర్శించుకున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, (సిమ్లా) త్రిపుర, పాండిచ్చేరి, కర్ణాటక, (బెంగుళూర్‌) గుజరాత్‌ (రాజ్‌కోట్‌) రాష్ట్రాలకు చెందిన వీసీలు సంజయ్‌శర్మ, మిలాని రాణి, వెంకటరావు, విష్ణకంటి, నవీన్‌చంద్‌ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద పూజలు చేశారు. దేవాదాయశాఖ అధికారులు, పూజారులు డోలివాయిద్యాలతో వీసీలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైస్‌ చాన్స్‌లర్లను పూజారులు అమ్మవారి శేషవస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ జూనియర్‌ అసిస్టెంట్లు మధు, బాలకృష్ణ, పూజారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement