కర్నూలు(అగ్రికల్చర్): ఎండలు, వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయి. ఎల్నినో ప్రభావంతోనే ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎల్నినో కారణంగానే రుతుపవనాలు బలహీనపడినట్లు తెలుస్తోంది. చాగలమర్రిలో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం రోహిణి కార్తె కావడంతో రోళ్లు పగిలే తీవ్రమైన స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండటం గమనార్హం.
మండలం ఉష్ణోగ్రత
నంద్యాల రూరల్ 43.8
ఆళ్లగడ్డ 43.1
గోస్పాడు 42.7
గూడూరు 42.3
ఉయ్యాలవాడ 42.4
సంజామల 42.1
దొర్నిపాడు 42.1
రుద్రవరం 42
కోడుమూరు 41.8
కోసిగి 41.6


