అక్రమంగా బాలలను తలరిస్తున్న ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమంగా బాలలను తలరిస్తున్న ముఠా అరెస్ట్‌

Dec 12 2025 6:43 AM | Updated on Dec 12 2025 6:43 AM

అక్రమంగా బాలలను తలరిస్తున్న ముఠా అరెస్ట్‌

అక్రమంగా బాలలను తలరిస్తున్న ముఠా అరెస్ట్‌

బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలో అక్రమంగా బాలలను తరలిస్తున్న ముఠా సభ్యులను రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలలో ఆరుగురు ముఠా సభ్యులు కొంత కాలంగా బాలలను మాయమాటలతో వస పరుచుకొని ఇతర రాష్ట్రాల వారికి కూలీ పని చేసేందుకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఆరుగురు బాలలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆరుగురు బాలురలను, ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అంగీకరించారని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. చిన్నారులను చిల్డ్రన్‌ హోంకు తరలించామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement