జాతీయ స్థాయి పోటీలకు కంబదహాల్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు కంబదహాల్‌ విద్యార్థులు

Dec 11 2025 8:28 AM | Updated on Dec 11 2025 8:28 AM

జాతీయ స్థాయి పోటీలకు కంబదహాల్‌ విద్యార్థులు

జాతీయ స్థాయి పోటీలకు కంబదహాల్‌ విద్యార్థులు

సి.బెళగల్‌: మండల పరిధిలోని కంబదహాల్‌ గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాఫ్ట్‌ బాల్‌ క్రీడలలో ప్రతిభ చాటడంతో జాతీయస్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం రవీంద్ర తెలిపారు. బుధవారం ఆయన వివరాలను తెలిపారు. పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న అమ్యూల, అజయ్‌లు గుంటూరు జిల్లాలోని మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌ – 19 సాఫ్ట్‌ బాల్‌ పోటీలలో జిల్లా జట్లలతో పాల్గొన్నారని తెలిపారు. క్రీడలలో ప్రతిభ చాటడంతో అమ్యూల, అజయ్‌ (స్టాండ్‌ బైగా) జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 30వ తేదీ నుంచి జనవరి నెల 3వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ జట్టు తరఫున మహారాష్ట్రలోని నాగాపూర్‌లో జరిగే జాతీయ స్థాయి అండర్‌ – 19 సాఫ్ట్‌ బాల్‌ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై హెచ్‌ఎం పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ) శ్రీనివాసులు (బబ్లు)ను, విద్యార్థులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement