విజిలెన్స్‌ అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ అధికారుల దాడులు

Dec 9 2025 9:29 AM | Updated on Dec 9 2025 9:29 AM

విజిలెన్స్‌ అధికారుల దాడులు

విజిలెన్స్‌ అధికారుల దాడులు

ఆత్మకూరు: పట్టణంలోని పలు దుకాణాలపై సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. అతిథి హోటల్‌లో చికెన్‌ను పరిశీలించి సరిగ్గా లేకపోవడంతో రూ.10 వేలు జరిమానా విధించారు. అలాగే కప్పలకుంట్లలోని అనన్‌ బేకరీలో అటుకులు పరిశీలించి నాణ్యతగా లేవని రూ.8 వేలు జరిమానా విధించారు. బ్రదర్‌ బేకరీలో కూల్‌ కేకులను టెస్టింగ్‌కు పంపించారు. అధికారుల దాడుల నేపథ్యంలో పలువురు వ్యాపారులు దుకాణాలు మూసేశారు. విజిలెన్స్‌ అధికారులు వెంకటరమణ, విశ్వనాథం, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌ షేక్షావలి, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement