
దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే
ఉర్దూ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలంటే కర్నూలు, అనంతపురం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో 1 నుంచి 5వ తరగతి వరకు, పట్టణ ప్రాంతాల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకోవడానికి పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుకునేందుకు ఇక్కడి ప్రాంతంలో అవకాశాలు లేవు. దీంతో చాలా మంది చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు. అధికారులు స్పందించి కళాశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి.
– ఫయాజ్ అహ్మద్ నిజాం, కౌన్సిలర్, ఆదోని
కళాశాలను ప్రారంభించాలి
మైనార్టీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యింది. కానీ ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. కళాశాల ప్రారంభమైతే అందులో చేరాలని ఎంతోమంది విద్యార్థినులు ఎదురు చూస్తున్నారు. అసలు ఈ విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభమవుతుందో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికై న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కళాశాలను ప్రారంభించాలి.
– గౌస్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి

దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే