దివ్యాంగులకు యూడీఐడీ | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు యూడీఐడీ

Mar 19 2025 1:24 AM | Updated on Mar 19 2025 1:19 AM

శాశ్వత ఐడీ తప్పనిసరి

దివ్యాంగులకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసేవారు. అయితే ఇకపై శాశ్వతంగా ఆధార్‌కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీను ప్రవేశపెట్టింది. దివ్యాంగులకు రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. దివ్యాంగులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని ఈ కార్డును పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – రయిస్‌ ఫాతిమా, ఏడీ,

దివ్యాంగుల సంక్షేమ శాఖ

కర్నూలు(అర్బన్‌): దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు, ఇతరత్రా సేవలకు సదరం స్థానంలో యూడీఐడీ (యూనిక్‌ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు )ని అందించనుంది. దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే చేయూత, ఇతర ప్రయోజనాలకు ఇప్పటి వరకు సదరం సర్టిఫికెట్‌ తప్పనిసరి. దీని కోసం దివ్యాంగులు గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సదరం శ్లాట్‌ బుక్‌ చేసుకుంటే ప్రభుత్వం నిర్దేశించిన వైద్య శిబిరంలో వైద్యులు వైకల్య నిర్ధారణ అనంతరం సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లకు స్వస్తి పలికింది. ఆ స్థానంలో యూడీఐడీని పొందేందుకు స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్‌ (https://swavlambancard. gov.in) అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో దివ్యాంగులు నేరుగా ఇంటి వద్ద నుంచే ఫోన్‌, ఇంటర్‌నెట్‌ సెంటర్‌, మీ సేవా కేంద్రాల నుంచి కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సులభతరంగా సేవలు ...

కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్‌ వల్ల సేవలు చాలా సులభతరం కానున్నాయి. ఇకపై సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి సదరం శిబిరాలకు సంబంధించి ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్‌ నెంబర్‌కు సంక్షిప్త సందేశం రూపంలో వస్తుంది. దివ్యాంగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఎలాంటి తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఐదు రకాల వైకల్యం ఉన్న వారికే మీ సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్‌లో 21 రకాల వైకల్యాలను చేర్చారు. తలసేమి యా, ఆటిజం, యాసిడ్‌ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీ ఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సదరం శిబిరంలో వైకల్య నిర్ధారణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్లను స్మార్ట్‌ కార్డు రూపంలో పోస్టల్‌శాఖ ద్వారా ఇంటికే పంపించనున్నారు. ఈ కార్డు ద్వారా చేయూత పింఛన్లతో పాటు ఇతర పలు సంక్షేమ ప్రయోజనాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. యూనిక్‌ డిజేబులిటీ ఐడీ కార్డులను ఆన్‌లైన్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకు ఉన్న సదరం సర్టిఫికెట్లు మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి.

ఇలా దరఖాస్తు చేసుకోండి ...

ఆన్‌లైన్‌లో స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్లయ్‌ బటన్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకొని తరువాత అంగీకరిస్తు సబ్‌మిట్‌ క్లిక్‌ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్‌ అవుతుంది. దివ్యాంగులు వారికి చెందిన పూర్తి సమాచారాన్ని అక్కడ అడిగిన విధంగా నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. వైద్య పరీక్షల అనంతరం వెబ్‌సైట్‌లో అర్జీల స్టేటస్‌ను నిత్యం పరిశీలించుకోవచ్చు.

కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి

తెచ్చిన కేంద్ర ప్రభుత్వం

21 రకాల సేవలు సులువుగా

పొందే అవకాశం

దివ్యాంగులకు యూడీఐడీ1
1/1

దివ్యాంగులకు యూడీఐడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement