పెడన: మండలంలోని మడక గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ పనులతో చేపట్టిన కోనేటి గుంత (ఫాం పాండ్) తవ్వకం పనులను ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్తో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం పరిశీలించారు. అనంతరం అక్కడ మొక్కలు నాటారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పది సూత్రాల కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర, నీటి భద్రత చాలా ముఖ్యమైనవన్నారు. కోనేటి గుంతల తవ్వడం, సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంచుతున్నామని పేర్కొన్నారు. పంట కాలువలు, చెరువుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచుతామన్నారు. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. విరివిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించి భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పెడనలో వ్యర్థాల నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ శివప్రసాద్, జెడ్పీ సీఈఓ డాక్టర్ జె.అరుణ, జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, ఇన్చార్జి తహసీల్దారు కె.అనిల్కుమార్, ఎంపీడీఓ అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.
కేడీసీసీ బ్యాంక్కు
ఐఎస్వో సర్టిఫికెట్


