ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం

Aug 8 2025 9:09 AM | Updated on Aug 8 2025 9:09 AM

ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం

ఇతర రాష్ట్రాలకు ధీటుగా రాజధాని నిర్మాణం

గుణదల(విజయవాడ తూర్పు): దేశానికి తలమానికంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి నారాయణ అన్నారు. విజయవాడ భారతీనగర్‌ నోవోటెల్‌ హోటల్లో గురువారం గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌ – 2025 నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ నగర ప్రతిష్టతను ఇనుమడింప చేసే విధంగా పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. అధునాతన నిర్మాణ శైలిని అనుసరిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటక రంగంలో రాజధాని గుర్తింపు సాధిస్తుందని వెల్లడించారు. అనంతరం గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌ బ్రోచర్‌ను విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement