అలరించిన భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

అలరించిన భక్తప్రహ్లాద నాటక ప్రదర్శన

Mar 16 2025 1:48 AM | Updated on Mar 16 2025 1:47 AM

విజయవాడ కల్చరల్‌: ఏపీ సాంస్కృతిక శాఖ, సృజనాత్మక సమితి, దక్షిణమండల సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యాన 6 రోజులపాటు నిర్వహించే సురభి నాటకోత్సవాలు దుర్గాపురంలోని సంగీత కళాశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీ వెంకటేశ్వర సురభి థియేటర్‌, విజయ భారతి నాట్యమండలి ఆధ్వర్యాన సురభి జయచంద్రవర్మ పర్యవేక్షణలో భక్తప్రహ్లాద నాటకాన్ని రసరమ్యంగా ప్రదర్శించారు. ఒకే కుటుంబానికి చెందిన 50 మంది చిన్నా పెద్దా కళాకారులు పాల్గొనడం విశేషం. తొలుత నాటకోత్సవాలను గ్రీవెన్స్‌ అధికారి చిన్నారావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సురభి నాటకాలకు 140 సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఉప సంచాలకుడు పెంచలయ్య సురభి నాటకంపై మాట్లాడారు. నర్తనం ప్రధాన సంపాదకురాలు మాధవి పురాణం సురభి నాటక ప్రస్తానం అంశంగా ప్రసంగించారు. కార్యక్రమాన్ని అంతర్జాతీయ నాట్యాచారిణి స్వర్ణలత నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement