వైఎస్సార్‌ సీపీ మైలవరం ఇన్‌చార్జిగా తిరుపతిరావు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మైలవరం ఇన్‌చార్జిగా తిరుపతిరావు

Feb 3 2024 1:30 AM | Updated on Feb 3 2024 11:08 AM

- - Sakshi

మైలవరం: వైఎస్సార్‌ సీపీ మైలవరం నియోజకవర్గ ఇన్‌చార్జిగా సర్నాల తిరుపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. సర్నాల తిరుపతిరావు బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యుడిగా పార్టీ అవకాశం కల్పించడంతో గెలుపొందారు. సర్నాల తిరుపతిరావు పేద కుటుంబానికి చెందినవాడైనప్పటికీ పార్టీకి విధేయంగా పనిచేస్తున్న ఆయన సేవలు గుర్తించి ఈసారి బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి తిరుపతిరావుకు ఈ అవకాశం కల్పించడంతో స్థానిక బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు పదవి ఇచ్చినందుకు తిరుపతిరావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement