రెబ్బెన: ఇందిరానగర్లో గల కనకదుర్గాదేవీ, స్వ యంభూ మహంకాళి దేవస్థాన క్షేత్ర పాలకుడు కా లభైరవ స్వామికి శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టు పక్కల మండలాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. స్వామివారిని ద ర్శించుకుని కూష్మాండ, నెయ్యి దీపాలతో దీపారాధ న చేశారు. మంగళహారతులతో ప్రత్యేక పూజలు చే శారు. స్వీట్లు, మద్యం నైవేద్యంగా సమర్పించి మొ క్కు తీర్చుకున్నారు. కాలభైరవ స్వామి అష్టకం, జ పం, ధ్యానం పారాయణాలు చేశారు. ప్రధాన అర్చకుడు వినోద్స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.


