ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలి

Nov 9 2025 7:11 AM | Updated on Nov 9 2025 7:11 AM

ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలి

ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలి

కాగజ్‌నగర్‌ టౌన్‌: సిర్పూరు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయించాలని రా ష్ట్ర సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఎ మ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు శనివారం వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌లోని అతడి నివా సంలో మంత్రిని ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలి శారు. సిర్పూరు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉ న్న జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని, పీపీరా వు ప్రాజెక్ట్‌, ఖర్జి పెద్దచెరువులను పునరుద్ధరించాల ని, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీంల నిర్వహణ పనులకు నిధు లు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. కౌటా ల మండలంలోని తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌ డీపీఆర్‌పై కూడా చర్చించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో పెండింగ్‌ ప్రాజెక్ట్‌లపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్‌ ఈఈ ప్రభాకర్‌, డీఈ భద్రయ్య, వెంకటరమణ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement