వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

Sep 20 2025 6:26 AM | Updated on Sep 20 2025 6:26 AM

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

ఆసిఫాబాద్‌: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌(ఆపరేషన్‌) టి.మధుసూదన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం చీఫ్‌ ఇంజినీర్‌ ఆపరేషన్‌ –1 అశోక్‌తో కలిసి విద్యుత్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసేందు కు అవసరమైన పరికరాలు అందిస్తామని తె లిపారు. జిల్లాలోని అన్ని సబ్‌స్టేషన్లకు ప్రత్యామ్నాయ లైన్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఉద్యోగులు పనిచేసే సమయంలో అన్నిరకాల భద్రత పరికరాలు ఉపయోగించాలని సూచించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. సమావేశంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ రాథోడ్‌ శేషారావు, డీఈఈలు, ఏడీఈలు, ఏఈఈలు, సబ్‌ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement