
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
ఆసిఫాబాద్అర్బన్: శాంతిభద్రతలో పరిరక్షణలో పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణకు అత్యంత వైభవమైన ఘన చరిత్ర, అఖండమైన వారసత్వం ఉందన్నారు. గొప్ప చారిత్రాత్మక వారసత్వం, మహోన్నత పాలన విధానాలకు కొలువైన తెలంగాణ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి, పట్టుదలతో 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. ఆపరేషన్ పోలో చర్య ద్వారా తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందని పేర్కొన్నారు. నిజాయతీగా విధులు నిర్వర్తించి జిల్లా పోలీసు శాఖకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, డీసీఆర్బీ డీఎస్పీ విష్ణుమూర్తి, సీఐలు, ఆర్ఐ లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.