
రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతి
రెబ్బెన: మండలంలోని వంకులం స మీపంలో పెద్దవా గు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొని ఒకరు అక్కడికక్క డే మృతి చెందా డు. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. ఆసిఫాబాద్ మండలం రాపెల్లికి చెందిన సు నార్కర్ ఆనంద్రావు (47) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం కాగజ్నగర్ నుంచి బైక్పై రాపెల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో ఆయన తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరోబైక్పై ప్రయాణిస్తున్న ఎన్నం తిరుపతి, ఎన్నం కృష్ణకుమార్కు గాయాలు కాగా ప్రైవేటు వాహనంలో కా గజ్నగర్ తరలించారు. మృతుడికి భార్య, ఇ ద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య సురేఖ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్ గ్రామం 61వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి గాయాలయయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసా పట్టణంలోని రాహుల్నగర్కు చెందిన రోహిత్ (21), చంద్రకాంత్లు బైక్పై నిర్మల్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో అతివేగంగా, జాగ్రత్తగా నడుపుతూ నిలిపి ఉన్న ఎడ్లబండిని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రోహిత్కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు 108 వాహనంలో నిర్మల్ తరలించగా మార్గమధ్యలో మృతిచెందాడు. చంద్రకాంత్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు.