● ఉష్ణోగ్రతలు మరింత ౖపైపెకి.. ● ఎర్రుపాలెంలో గరిష్టంగా 46.4 డిగ్రీలుగా నమోదు
ఖమ్మంవ్యవసాయం: ఎండలు ఏ మాత్రం తగ్గకపోవడంతో జిల్లా అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ఆరు రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలోనే నమోదవుతున్నాయి. ఈమేరకు శుక్రవారం 16 ప్రాంతాలు రెడ్ అలర్ట్ జోన్లో ఉండగా, శనివారం 24 ప్రాంతాలు కొనసాగాయి. ఇక ఆదివారం ఆ సంఖ్య 29కి పెరగ డం గమనార్హం. జిల్లాలో ఆదివారం గరిష్టంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండకు తోడు మధ్యాహ్నం వడగాలులు, రాత్రికూడా వేడి ప్రభావం కొనసాగుతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.


