ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయభేరి మోగించారని సర్వజ్ఞ జూనియర్ కళాశాల చైర్మన్ ఆర్.వీ.నాగేంద్రకుమార్, డైరెక్టర్ నీలిమ తెలిపారు. మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించాక వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470మార్కులకు వై.వెన్నెల 468, ఎన్.సాయి మణికంఠ, బి.తరుణ్, వై.అనితర 467 మార్కులు, జి.అనన్య వెంకట్, జి.జ్ఞాన దీప్తి, వై.గీత మాధురి 466మార్కులు, పి.ఆదిత్య 464, బి.హశ్వంత్, ఏ.భవ్య, ఆర్.సాయితేజ 463 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440 మార్కులకు ఐ.సాయి విశ్వనాథ్ 437, జ్ఞాన ప్రసూనంబ 435, ఎన్.అభినందిత 434, బి.అశ్విత 433 మార్కులు సాధించారని, పలువురు 400కిపైగా మార్కులు సాధించారని తెలిపారు. వీరిని చైర్మన్, డైరెక్టర్తో పాటు అధ్యాపకులు, ఉద్యోగులు జనార్దన్ అభినందించారు.


