పాల్వంచ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) అనుబంధ ఎన్పీడీసీఎల్ కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పాల్వంచలోని కేటీపీఎస్ ‘ఏ’ కాలనీలో ఉన్న తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్–142) కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కేవీ.రామారావు ఆధ్వర్యాన జరిగిన సమావేశానికి కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.దేవ్సింగ్, ఉపాధ్యక్షులుగా బి.స్వామి, ప్రధాన కార్యదర్శిగా ఎ.నాగరాజు, సహాయ కార్యదర్శిగా వి.మోతీలాల్, ప్రచార కార్యదర్శిగా ఆర్.యాకయ్య, కోశాధికారిగా సీహెచ్.కృష్ణయ్యతో పాటు కార్యవర్గ సభ్యులుగా కె.బాలరాజు, జి.వేణు, ఎం.రాజు, ఎల్.బలరాంను ఎన్నుకున్నారు. అలాగే, వివిధ జిల్లాలకు చెందిన నాయకులు యూనియన్లో చేరగా వారిని ఆహ్వానించాక రామారావు మాట్లాడారు. కార్మికులు కష్టించి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి చేయూతనివ్వాలని సూచించారు. అలాగే, నూతన కార్యవర్గం కార్మిక సంక్షేమం కోసం కృషి చేయాలని తెలిపారు. నాయకులు ఎస్.శ్రీనివాసాచారి, డి.సత్యరాజ్ స్టీవెన్, వెంపటి వెంకటేశ్వర్లు, షేక్.సయ్యద్, వి.కోటేశ్వరరావు, యాకయ్య, భిక్షపతి, గణేశ్, అమర్ తదితరులు పాల్గొన్నారు.


