పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ప్రక్రియను సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఖర్తడే కాళీచరణ్ సుధామరావు పరిశీలించారు. ఈమేరకు 1,899 పోలింగ్ అధికారులు, 2321 ఓపీఓలను కేటాయించి, 20శాతం మందిని రిజర్వ్ చేశామని తెలిపారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడగా అదనపు కలెక్టర్ శ్రీజ, సీపీఓ శ్రీనివాస్, డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి, ఈడీఎం దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు.


