●నాడు పతులు.. నేడు సతీమణులు
కామేపల్లి: కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి ఇద్దరు మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో గ్రామానికి చెందిన బానోత్ రవి బీఆర్ఎస్ తరఫున, బానోత్ దేవాలాల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా రవి విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో బానోత్ రవి భార్య శాంతి, దేవాలాల్ భార్య కమల బరిలో ఉన్నారు. ఒకరు చేసిన అభివృద్ధిని వివరిస్తూ, ఇంకొకరు గత ఎన్నికల్లో ఓడిపోయినందున ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
●నాడు పతులు.. నేడు సతీమణులు


