
మున్నేటికి వరద
వారం రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్నేటికి ఎగువ నుంచి వరద తాకిడి లేకపోవడంతో ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. అయితే, సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వరద పెరిగింది. మున్నేటికి ఎగువ ప్రాంతాల్లో వర్షం కురవడం, పాకాల నుండి వరద
వస్తుండడంతో మధ్యాహ్నం 2గంటల నుంచి ఖమ్మం కాల్వొడ్డు వద్ద 10అడుగులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మున్నేరు వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులతో గస్తీ ఏర్పాటు చేయించారు. అంతేకాక ఎగువ ప్రాంతాల్లో వర్షాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. – ఖమ్మంమయూరిసెంటర్/ఖమ్మం అర్బన్