నిబద్ధతతో సేవలందించిన వెంకటనాగేశ్వరరావు | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతో సేవలందించిన వెంకటనాగేశ్వరరావు

Aug 1 2025 11:44 AM | Updated on Aug 1 2025 11:44 AM

నిబద్ధతతో సేవలందించిన వెంకటనాగేశ్వరరావు

నిబద్ధతతో సేవలందించిన వెంకటనాగేశ్వరరావు

ఖమ్మం మయూరిసెంటర్‌: వృత్తి నిబద్ధతతో విధులు నిర్వర్తించిన వనం వెంకట నాగేశ్వరరావు సంస్థపై ప్రజల్లో నమ్మకం పెంచారని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంజనీర్‌ వెంకట నాగేశ్వరావు ఉద్యోగ విరమణ సన్మాన గురువారం ఖమ్మంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ డీజీఎం రాజశేఖర్‌, ఏజీఎంలు సుష్మా, శ్రీనివాస్‌, పీఎస్‌ఎన్‌ఎల్‌ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తదితరులు మాట్లాడుతూ ఎక్కడైనా సమస్య వస్తే రాత్రీపగలు తేడా లేకుండా ఆయన స్పందించేవారని కొనియాడారు. అనంతరం వెంకటనాగేశ్వరావు – స్వర్ణలత దంపతులను పలువురు సన్మానించగా అర్చకులు బొర్రా వాసుదేవాచార్యుల బృందం వేద మంత్రాలతో ఆశీర్వదించింది. ఈకార్యక్రమంలో నాగేశ్వరరావు కుమార్తె, కుమారుడు రాణి రాజ్యలక్ష్మి, రాజీవ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తిరుమలాచార్యులు, బీఆర్‌.వీరస్వామి, సోమగాని ఉపేందర్‌, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement