
●సంపూర్ణ విద్య.. విద్యాక్షేత్ర
ఖమ్మంలోని విద్యాక్షేత్ర పాఠశాల అనుభూతి ఆధారిత, సాంస్కృతికంగానే కాక సంపూర్ణ విద్యకు నిదర్శనంగా నిలుస్తోందని కరస్పాండెంట్ సౌభాగ్య తెలిపారు. ఆధునిక విద్యను సంప్రదాయ కళలు, హస్తకళలు, వ్యవసాయం, తల్లిదండ్రులు–గురువుల మధ్య పరస్పర సహకారంతో మిళితం చేశామని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకత, కరుణ, ఆత్మవిశ్వాసం కలిగిన సమగ్ర వ్యక్తిత్వాన్ని నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆమె తెలిపారు. విద్యార్థులను సంపూర్ణ వ్యక్తిత్వంతో తీర్చిదిద్దే మహోన్నత కార్యానికి శ్రీకారం చుట్టామని సౌభాగ్య వివరించారు.