సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని వెంగళరావునగర్ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడు అగ్గి రవి (42) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన ఆయన ప్రస్తుతం భీమునిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. సత్తుపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఎర్రగుంటకు వెళ్లే క్రమాన జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రవిని ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భార్య కవిత దమ్మపేట మండలం మొండివర్రె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రవి సోదరుడు కూడా గతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు తెలిసింది.
చికిత్స పొందుతున్న హెచ్ఎం మృతి