
చాకచక్యంగా బయటకు వచ్చి తలుపులు గడిపెట్టేశారు. అటవీ అధికారులు అక్కడకు చేరుకుని చిరుతకు...
దొడ్డబళ్లాపురం: ఇంట్లో చొరబడిన చిరుతపులి అక్కడే బందీ అయ్యింది. రామనగర తాలూకా జాలమంగల గ్రామంలో రేణుకాచార్య అనే వ్యక్తి ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత ప్రవేశించింది. దానిని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి చాకచక్యంగా బయటకు వచ్చి తలుపులు గడిపెట్టేశారు. దీంతో పెద్ద ము ప్పు తప్పింది. అటవీ అధికారులు చేరుకుని చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి తీసుకెళ్లారు.
(చదవండి: కూతుళ్లే పుట్టారని వేధింపులు.. తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య)