మాదప్పకు ఉగాది రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

మాదప్పకు ఉగాది రథోత్సవం

Mar 20 2026 7:58 AM | Updated on Mar 20 2026 7:58 AM

మైసూరు: ఉగాది జాతర మహోత్సవంలో భాగంగా, రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని శ్రీ క్షేత్ర మలే మహాదేశ్వర బెట్టలో గురువారం లక్షలాది మంది భక్తుల సమక్షంలో మహారథోత్సవం జరిగింది. సాలూరు మఠాధిపతి కంథ మల్లికార్జున స్వామి నాయకత్వంలో, మూలవిరాట్‌ కు రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు చేశారు. తరువాత బ్రహ్మ రథానికి పూజ చేసి, వివిధ క్రతువులు నిర్వర్తించారు. దేవుని విగ్రహాన్ని తెల్లని గుర్రంపై ఉంచి, గొడుగు, చామరం, శుభ సాధనాలతో ఆలయం, తేరు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. బెడగంపన్‌ సమాజానికి చెందిన పూజారులు, 108 మంది పిల్లలు ప్రత్యేకంగా పాల్గొన్నారు. వేలాది భక్తులు స్వామి నామాన్ని జపిస్తూ తేరును లాగారు. తరువాత గురు బ్రహ్మోత్సవం, ఆపై అన్న బ్రహ్మోత్సవం జరిగింది. అనంతరం శాంత మల్లికార్జున స్వామి భక్తులకు వేప, బెల్లాన్ని పంపిణీ చేశారు. హిల్‌ అథారిటీ కార్యదర్శి ఏఈ రఘు, ఏఎస్పీ శశిధర్‌, డీఎస్పీ ధర్మేంద్ర పాల్గొన్నారు.

బెట్టపై భక్త సంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement