బొగ్గు చౌర్యంపై క్రిమినల్ కేసు పెట్టండి
రాయచూరు రూరల్: యరమరస్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం(వైటీపీఎస్)లో బొగ్గు దొంగతనంలో అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములని, బాధ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు నరసింహులు మాట్లాడారు. రాయచూరు నుంచి యరమరస్ వరకు రైల్వే లైన్లలో వ్యాగన్లతో వెళ్లే రేకులను అన్లోడ్ చేసి కొద్ది మేర ఉంచుకొని ఆ బొగ్గును యరమరస్ రైల్వే స్టేషన్లో గంట సేపు నిలిపి అక్రమంగా విక్రయాలు చేశారన్నారు. బొగ్గును వైటీపీఎస్ ఇంజినీర్లు హరీష్, చంద్రశేఖర్, సబ్ కాంట్రాక్ట్ పొందిన పవర్ మేక్ సూపర్వైజర్ హరికృష్ణ, మేనేజర్ సురేంద్రనాథ్, స్టేషన్ మాస్టర్ సర్కార్, వ్యాగన్ల క్లీనింగ్ సిబ్బంది, గురు రాఘవేంద్ర ఎంటర్ప్రెజస్ శేషగిరి ఏకమై అక్రమంగా వైటీపీఎస్కు తరలాల్సిన బొగ్గును దొంగచాటుగా ఇతర ప్రాంతాలకు తరలించిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు.


