లోకాయుక్త ఆకస్మిక దాడులు | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త ఆకస్మిక దాడులు

Dec 17 2025 6:49 AM | Updated on Dec 17 2025 6:49 AM

లోకాయ

లోకాయుక్త ఆకస్మిక దాడులు

శివమొగ్గలో తాగునీటిశాఖ కార్యాలయం

శివమొగ్గలో ఈఈ రూప్లానాయక్‌ నివాసంలో సోదాలు

బనశంకరి: ఉద్యోగాల చాటున ఆదాయానికి మీరి అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అధికారుల ఇళ్లు, కార్యాలయాలపై లోకాయుక్త దాడులు జరిపింది. మంగళవారం బెళగావి, హావేరి, చిత్రదుర్గ, ధార్వాడ, శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో సోదాలు జరిగాయి.

ఎక్కడెక్కడ అంటే..

● బెళగావి వ్యవపాయ విజిలెన్స్‌ డిప్యూటి డైరెక్టర్‌ రాజశేఖర్‌ నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. లోకాయుక్త ఎస్పీ సిద్దలింగప్ప , డీఎస్‌పీలు కురబగట్టి, వెంకనగౌడపాటిల్‌ పాల్గొన్నారు. ఆయనకు చెందిన బెళగావి, ధార్వాడ, హావేరి తదితర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

● శివమొగ్గలో జిల్లా గ్రామీణ తాగునీటి శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రూప్లానాయక్‌ ఇంటిలో తనిఖీలు ప్రారంభించారు. ఆయన కుటుంబం నివాసం ఉండే బెంగళూరు ఇంటిలోనూ సోదాలు చేశారు. చిక్కమగళూరు కడూరులో ఆయన సహాయకుడు తాంబే ఇంటినీ సోదాలు చేశారు. మొత్తం 6 లోకాయుక్త బృందాలు పాల్గొన్నాయి.

● విజయనగర జిల్లా ఆరోగ్యాధికారి డాక్టర్‌ శంకర్‌నాయక్‌ కార్యాలయం, ఇళ్లు, ఆసుపత్రిపై దాడిచేశారు. లోకాయుక్త డీఎస్పీ సచిన్‌, సీఐ అమరేశ్‌, రాజేశ్‌లమాణి పాల్గొన్నారు. ఈ సోదాల్లో పెద్దమొత్తంలో డబ్బు, బంగారం, విలువైన సొత్తు లభించినట్లు తెలిసింది.

ముగ్గురు అధికారుల ఇళ్లలో సోదాలు

లోకాయుక్త ఆకస్మిక దాడులు1
1/1

లోకాయుక్త ఆకస్మిక దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement