పశువుల ఆస్పత్రి మార్పు వద్దు | - | Sakshi
Sakshi News home page

పశువుల ఆస్పత్రి మార్పు వద్దు

Dec 7 2025 12:18 PM | Updated on Dec 7 2025 12:18 PM

పశువుల ఆస్పత్రి మార్పు వద్దు

పశువుల ఆస్పత్రి మార్పు వద్దు

కేజీఎఫ్‌: బంగారు గనుల ప్రాంతంలో బ్రిటీష్‌ హయాంలో నిర్మించిన మైసూర్‌ మైన్స్‌ ప్రాథమిక పశువుల ఆస్పత్రిని మరో ప్రాంతానికి తరలించవద్దని గ్రామీణ ప్రాంతాల రైతులు హెచ్చరిస్తున్నారు. బంగారు గనుల ప్రాంతంలోని ఐదు వార్డులకు చెందిన మారికుప్పం, బళిగానహళ్లి, గిడ్డగౌడనహళ్లి, కేజీఎఫ్‌ ఎ బ్లాక్‌, సౌత్‌ బ్లాక్‌, హళ్లి కుడ్య, చిన్నకల్లు, నగర కమీషన్‌ లైన్‌, పర్పెంటర్‌ కాలనీ, ఛాంపియన్‌ రైల్వే స్టేషన్‌ కాలనీలలోని పలు కుటుంబాలు జెర్సీ ఆవులు, గొర్రెలు, మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వీరంతా తమ పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ ఆస్పత్రిలోనే టీకాలు వేయిస్తారు. ఈ ఆస్పత్రిలో సుమారు నెలకు 9 నుంచి 10 వేల మూగ ప్రాణులకు చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే సిఫారసు మేరకు ఇపుడు అకస్మాత్తుగా ఆస్పత్రిని బడమాకనహళ్లికి తరలించడం తగదని, అలాచేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆ గ్రామాల పాడి రైతులు హెచ్చరిస్తున్నారు. స్థలాంతరం చేయడం వల్ల పశువుల చికిత్సకు ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిని అక్కడే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆస్పత్రిని ఇక్కడి నుంచి తరలించవద్దని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement