స్కౌట్స్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ వృద్ధి | - | Sakshi
Sakshi News home page

స్కౌట్స్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ వృద్ధి

Dec 4 2025 7:10 AM | Updated on Dec 4 2025 7:10 AM

స్కౌట్స్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ వృద్ధి

స్కౌట్స్‌ గైడ్స్‌తో క్రమశిక్షణ వృద్ధి

హొసపేటె: భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ శిక్షణలో పాల్గొనే విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ పెంపొందుతుందని పాఠశాల విద్యా శాఖ డిప్యూటీ డైరెక్టర్‌, భారత్‌ స్కౌట్స్‌ గైడ్స్‌ జిల్లా చీఫ్‌ కమిషనర్‌ వెంకటేష్‌ రామచంద్రప్ప అన్నారు. హోసూరు నగరంలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కర్ణాటక, విజయనగర జిల్లా సంస్థ, సురభి విద్యానికేతన్‌ స్కూల్‌, కాలేజీలు నిర్వహించిన రాష్ట్ర స్థాయి అవార్డు పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యున్నత రాష్ట్ర అవార్డు పరీక్ష రాసే విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. నేటి పిల్లలే రేపటి పౌరులు, పిల్లలు దేశానికి దోహదపడే మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. స్కౌట్స్‌ గైడ్స్‌ సంస్థ బాల్యం నుంచే కార్యకలాపాలు, శిబిరాల ద్వారా పిల్లలకు సమగ్ర జీవితాన్ని నిర్మించుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. ఫీల్డ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ బి.శేఖరప్ప మాట్లాడుతూ పాఠ్యాంశ విద్యతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా పిల్లలు మానసికంగా, శారీరకంగా బలంగా ఎదగవచ్చన్నారు. స్కౌట్స్‌గైడ్స్‌ ద్వారా కొన్ని సాహసోపేత కార్యకలాపాలు, శిబిరాలు పిల్లలను ధైర్యవంతులుగా చేస్తాయన్నారు. పాఠశాల అడ్మినిస్ట్రేటర్‌ శ్రీధర్‌, సంస్థ ఉపాధ్యక్షురాలు కమలా దీక్షిత్‌, స్కౌట్స్‌ జిల్లా కమిషనర్‌ ఎల్‌.బసవరాజ్‌, గైడ్స్‌ జిల్లా కమిషనర్‌ పీ.సునంద, జిల్లా కార్యదర్శి కే.రాజశేఖర్‌, జిల్లా సంయుక్త కార్యదర్శి అక్కమహాదేవి, క్యాంపు నాయకులు నాగరాజ్‌, జిల్లా శిక్షణ కమిషనర్‌ ఏ.రేణుక, స్థానిక సంస్థల జిల్లా కార్యదర్శి తిప్పేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement