
ఆర్టీసీ బస్సు బోల్తా
రాయచూరు రూరల్: రాయచూరుకు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దావణగెర నుంచి రాయచూరుకు వస్తున్న బస్సుకు కుక్క అడ్డుగా వచ్చింది. కుక్క తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పడంతో బోల్తా పడింది. ఏడవ మైలు మలుపు తిరుగు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ప్రొక్లెయిన్ ద్వారా ద్వారా బస్సును యాథాస్థితికి తీసుకొచ్చారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు.
15 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సు బోల్తా