
సమష్టి కృషితో క–క అభివృద్ధి
హొసపేటె: బ్రిటిషుల అధికారంలో ఉన్న హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాన్ని మనవారు దక్కించుకునేందుకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాడి చివరకు కళ్యాణ కర్ణాటక ప్రాంతాన్ని దక్కించుకొన్నారని, ప్రజలందరి కృషి మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని విజయనగర జిల్లాధికారిణి కవితా ఎస్ మన్నికేరి తెలిపారు. కళ్యాణ కర్ణాటక విమోచనోత్సవంలో భాగంగా బుధవారం పునీత్ జిల్లా క్రీడా మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ కర్ణాటక ఉత్సవ జెండాన్ని ఎగుర వేసిన అనంతరం మాట్లాడారు. 1948 సెప్టెంబర్ 17న భారత సైన్య నాయకుడు జనరల్ చౌదరి నేతృత్వంలో జరిగిన పోరాటంలో హైదరాబాద్ నిజాం లొంగిపోయి భారత యూనియన్లో చేరడానికి అంగీకరించారన్నారు. ఫలితంగా కన్నడ భాష ఈ రోజు పవిత్ర దినం, సాహిత్యం, సంస్కృతి, కళ, మతం మొదలైన రంగాలకు గణనీయమైన కృషి చేసిన జగజ్యోతి బసవన్న సామాజిక అభివృద్ధికి పునాది వేశారన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఈ ప్రాంతం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. నవంబర్ 8, 2013న ప్రభుత్వం కలబుర్గిలో కళ్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి మండలిని స్థాపించిందని, ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సహా ఈ ప్రాంతంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని ప్రాంతాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, సామాజిక, రహదారి కనెక్టివిటి, స్వచ్ఛమైన తాగునీటి వ్యవస్థ, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం సామాజిక, రహదారి కనెక్టివిటీ, స్వచ్ఛమైన తాగునీటి వ్యవస్థ, ఇతర ప్రాథమిక మౌలిక సదుపాయాలను అందించడానికి నిధులను కేటాయించిందన్నారు. విజయనగరం జిల్లాకు, 2025–26 సంవత్సరంనకు మైక్రో క్రియా యాక్షన్ ప్లాన్ కింద రూ. 22.445.34 లక్షలు, మైక్రో పథకం కింద రూ.9.464.90 లక్షలు గ్రాంట్ కేటాయించబడిందన్నారు. కళ్యాణ కర్ణాటకలో భాగమైన విజయనగర జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మనమందరం కలిసి పని చేయాలని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన జెండా వందనంతో పాటు విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతి కార్యక్రమాలు చూపురులను ఆకట్టుకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప హుడా అధ్యక్షుడు ఇమామ్ నియాజీ, గ్యారెంటీల హామీ అధ్యక్షుడు కే.శివమూర్తి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జాహ్నవి, సీఈఓ నోంగ్జాయ్ అక్రమ్ అలీ షా, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాధికారిణి కవితా ఎస్ మన్నికేరి

సమష్టి కృషితో క–క అభివృద్ధి