మొబైల్‌ వ్యసనానికి మరో బాలుడు బలి | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ వ్యసనానికి మరో బాలుడు బలి

Jul 18 2025 1:19 PM | Updated on Jul 18 2025 1:19 PM

మొబైల్‌ వ్యసనానికి మరో బాలుడు బలి

మొబైల్‌ వ్యసనానికి మరో బాలుడు బలి

యశవంతపుర: మొబైల్‌ఫోన్‌కు అలవాటుపడిన బాలలు పెద్దలు మందలించారని ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. హావేరి జిల్లాలో ఓ బాలుని ఆత్మహత్య మరువకముందే ఉత్తరకన్నడ జిల్లా హళియాళ మంగళవాడి గ్రామంలో మరో ఘోరం జరిగింది. ప్రాథమిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఓం కదం (13), ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ పాఠశాల అయిపోగానే మొబైల్‌తో కాలక్షేపం చేసేవాడు. ఎక్కువసేపు ఫోన్‌ చూడవద్దని తండ్రి మనోహర్‌ బుద్ధిమాటలు చెప్పాడు. దీంతో ఆక్రోశం చెందిన బాలుడు ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement