హాస్టల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ

Jul 12 2025 9:49 AM | Updated on Jul 12 2025 9:49 AM

హాస్టల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ

హాస్టల్‌ నిర్మాణ పనులకు భూమిపూజ

హొసపేటె: కూడ్లిగి తాలూకాలోని కానాహొసహళ్లిలో రూ.5 కోట్ల వ్యయంతో పోస్ట్‌మెట్రిక్‌ బాలికల హాస్టల్‌ నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌టీ శ్రీనివాస్‌ భూమిపూజ చేశారు. నియోజకవర్గంలోని కానాహొసహళ్లిలో రూ.5 కోట్ల వ్యయంతో కొత్త దేవరాజ అరసు పోస్ట్‌ మెట్రిక్‌ బాలికల హాస్టల్‌ నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. కూడ్లిగి నియోజకవర్గంలోని 14 హాస్టళ్లలో కానాహొసహళ్లి విద్యాభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కేకేఆర్‌డీబీ నిధుల మంజూరుతో ప్రీమెట్రిక్‌ బాలికల హాస్టల్‌ పనులను ప్రారంభించడం హర్షణీయమన్నారు. కొత్త మొరార్జీ పాఠశాల ఏర్పాటుకు కార్మిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకోసం శివపుర సమీపంలో 9 ఎకరాల భూమిని గుర్తించారన్నారు. కూడ్లిగి టీపీ ఈఓ నరసప్ప, బీసీఎం జిల్లా అధికారి శశికళ, ఉపాధ్యక్షుడు లక్ష్మీ రజనీకాంత్‌, జుట్టలింగనహట్టి బొమ్మన్న, ఏపీఎంసీ అధ్యక్షుడు కురిహట్టి బోసయ్య, బళెగార జగదీష్‌, కేజీ కుమార్‌ గౌడ, హులికెరె మారెప్ప, సూర్యప్రకాష్‌, జి.ఓబన్న, హొన్నూరస్వామి, దర్నీరు రంగన్న, మాజీ ఉపాధ్యక్షుడు హెచ్‌ దురుగేశ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement