
వచ్చామప్పా.. తిమ్మప్పా
మండ్య: జిల్లాలోని మద్దూరు తాలూకాలోని అబలవాడి గ్రామంలో వెలసిన చరిత్ర ప్రసిద్ధ తోపిన తిమ్మప్ప దేవస్థానంలో హరి సేవకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా భక్తులు తరలివచ్చారు. భక్తులందరికీ తామర ఆకుల్లో భోజనం పంపిణీ చేశారు. అబలవాడి గ్రామస్తులు ఈ వేడుకను జరిపారు. సోమవారం దేవాలయం ఆవరణలో హరిసేవను సంప్రదాయతీరిలో నిర్వహించారు. వచ్చామప్పా తిమ్మప్పా అంటూ లక్షకు పైగా భక్తులు తోపిన తిమ్మప్పను దర్శించుకున్నారు. ఉదయం 8 గంటల నుంచే దర్శనానికి బారులు తీరారు, అప్పటి నుంచే భక్తులకు అన్నదానాన్ని ఆరంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు తామర ఆకుల్లో భోజనం వడ్డించారు. తీపన్నం, అన్నం సాంబారు, గుమ్మడికాయల పళ్యం భోజనాన్ని సుష్టుగా ఆరగించారు. ఏటా ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ.
అబలవాడిలో ఘనంగా హరిసేవ
లక్ష మందికి తామరాకుల్లో భోజనం

వచ్చామప్పా.. తిమ్మప్పా