నెహ్రూ సేవలు అనన్యం | - | Sakshi
Sakshi News home page

నెహ్రూ సేవలు అనన్యం

May 28 2025 11:57 AM | Updated on May 28 2025 11:57 AM

నెహ్ర

నెహ్రూ సేవలు అనన్యం

రాయచూరు రూరల్‌ : దేశానికి దివంగత మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రు చేసిన సేవలు అనన్యమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నెహ్రూ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. అత్యంత ప్రభావశాలి ప్రధానమంత్రిగా దేశంలో పంచశీల సూత్రాలను అమలు చేశారని కొనియాడారు. జయంతిరావ్‌, జాగీర్దార్‌, మరిస్వామి, మంజుల, సురేఖ, రాణి, మాలా, శశికళ, రంగరాజ్‌, ఈరణ్ణ, చేతన్‌, వెంకణ్ణలున్నారు.

రాణా ప్రతాప్‌సింగ్‌ జయంతి

రాయచూరు రూరల్‌ : నగరంలో రాజపుత్‌ సమాజం ఆధ్వర్యంలో రాణా ప్రతాప్‌ సింగ్‌ 485వ జయంతిని వైభవంగా నిర్వహించారు. నగరంలోని మావినకెరె చెరువు వద్ద నెలకొల్పిన రాణా ప్రతాప్‌ సింగ్‌ ప్రతిమకు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. సమాజం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలన్నారు. అనంతరం పదో తరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో జయంతిరావ్‌, శాంతప్ప, రమేష్‌, శ్రీనివాసరెడ్డి, రుద్రప్ప, నరసింహులు, మనోహర్‌ సింగ్‌, వెంకటసింగ్‌, శంకర్‌సింగ్‌, మాన్‌సింగ్‌లున్నారు.

ఎస్టీలకు రిజర్వేషన్‌ కల్పించండి

రాయచూరు రూరల్‌: త్వరలో జరగనున్న కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి నగరసభలో ఎస్టీలకు 7 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్టీ నేతల సంఘం అధ్యక్షుడు వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఒకరు మాత్రమే సభ్యులుగా కొనసాగుతున్నారన్నారు. భవిష్యత్తులో నాయక్‌ వర్గానికి 7 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించేలా చూడాలని జిల్లాధికారి, నగరాభివృద్ధి ప్రాధికార మంత్రికి లేఖలు రాశామన్నారు. జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్‌ కోటాను పెంచాలన్నారు.

బాధితులకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌

రాయచూరు రూరల్‌: హస్మియా రక్షణ గోడల తొలగింపుతో వీధిన పడ్డ నివాసులకు పునర్వసతి ఏర్పాటు చేయాలని బీజేపీ ఎస్పీ యువమోర్చా అధ్యక్షుడు సన్నీ డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 40 ఏళ్ల నుంచి హస్మియా ప్రాంతంలో నివసిస్తున్న వారిని ఉన్నఫళంగా ఆక్రమించిన స్థలాల్లో దుకాణాలు, హోటళ్లు నిర్మించుకున్న వారందరూ స్థలాలను ఖాళీ చేయాలని వారం రోజుల క్రితం ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా తొలగించడాన్ని ఖండించారు. వక్ఫ్‌ బోర్డు అధికారులు తొలగిస్తున్న తరుణంలో కలబుర్గి హైకోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు వచ్చినా అధికారులు పునర్వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. హస్మియా రక్షణ గోడ వక్ఫ్‌ బోర్డుది కాదు, ప్రభుత్వ స్థలమని అన్నారు. ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఒత్తిడి చేశారు.

రాయచూరు, కలబుర్గిల్లో భారీ వర్షం

రాయచూరు రూరల్‌: రాయచూరు, కలబుర్గి జిల్లాల్లో సోమవారం సాయంత్రం రెండు గంటల పాటు జడి వానతో కూడిన భారీ వర్షం కురిిసింది. దీంతో జిల్లాలో ఎక్కడ చూసినా రహదార్లు బురద గుంటలుగా మారాయి. అరబ్‌ కాలనీ పక్కనే వంతెన ఉండడంతో ఆ నీరు కాలనీలోకి ప్రవేశించాయి. రంగ మందిరం వెనుక, జహీరాబాద్‌ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్‌ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నెహ్రూ సేవలు అనన్యం 1
1/3

నెహ్రూ సేవలు అనన్యం

నెహ్రూ సేవలు అనన్యం 2
2/3

నెహ్రూ సేవలు అనన్యం

నెహ్రూ సేవలు అనన్యం 3
3/3

నెహ్రూ సేవలు అనన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement