
మాక్ డ్రిల్కు ఏర్పాట్లు చేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో మాక్ డ్రిల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రులు శరణ ప్రకాష్ పాటిల్, బోసురాజు అధికారులకు సూచించారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. భారతదేశం పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శక్తినగర్, హట్టి బంగారు గనుల కంపెనీ, యరమరస్ విద్యుత్ కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలన్నారు. భద్రతా దళాలు, అగ్ని మాపక కేంద్రం, సివిల్, డిఫెన్స్, కంట్రోల్ గదులు, సైరన్ వంటి వాటిని సమకూర్చుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీ కుమార నాయక్, శాసన సభ్యులు బసన గౌడ, బసవరాజ్, హంపన గౌడ, బసన గౌడ, ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, జెడ్పీ సీఈఓ రాహుల్ తుకారాం పాండే, ఏడీసీ శివానంద, ఏసీ గజాననలున్నారు.
సైనికుల ధైర్య
సాహసాలకు హాట్సాఫ్
హొసపేటె: ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైనికులు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడాన్ని స్వాగతించిన బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు బుధవారం నగరంలోని వడకరాయ ఆలయంలో సైనికుల బలాన్ని ప్రశంసిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యువమోర్ఛా నేత కిచిడి కొట్రేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గాంలో మతం ఆధారంగా ఉగ్రవాదులు 26 మందిని చంపిన సంఘటన యావత్ భారత జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులను, వారు ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిజ్ఞ చేశారన్నారు. ఈ రోజు 140 కోట్ల మంది భారతీయులు సైనిక చర్య గురించి గర్వపడుతున్నారన్నారు. మన సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఉగ్రవాదులను మట్టికరిపించారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర నాయకులు, సైనికులకు బలాన్నిచ్చేందుకు ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు.
హంపీ విరుపాక్షేశ్వరుని
హుండీల లెక్కింపు
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపులో భక్తుల నుంచి భారీ ఆదాయం సమకూరిందని ఆలయ నిర్వాహకుడు హనుమంతప్ప తెలిపారు. ఆలయ గర్భగుడి ముందు ఉన్న హుండీ, దక్షిణం వైపు ఉన్న హుండీలలో భక్తుల నుంచి వచ్చిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.15,22,660 లభించినట్లు తెలిపారు.
నరేగ పనుల అడ్డగింత..
వ్యక్తిపై కార్మికుల దాడి
హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా ముత్తగి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నరేగ ప్రాజెక్టు పనులను ఒక వ్యక్తి అడ్డుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ముత్తగి గ్రామంలో నరేగ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో కార్మికులు కూడా పనిలో ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి నరేగ పని చేస్తున్న ప్రాంతంలో బోరుబావి నుంచి నీరు పోసి పనిని అడ్డుకున్నాడు. దీని వల్ల నరేగ కార్మికులకు సమస్యలు ఎదురవుతున్నాయి. వారు నీటిలో పని చేయలేకపోతున్నారు. ఇంతలో కోపంతో ఉన్న నరేగ కార్మికులు పని సమయంలో అతనిపై నీళ్లు పోసి తమ పనిని అడ్డుకున్నందుకు ఆ వ్యక్తిని నిందించారు. ఇక్కడ పని జరగకూడదనుకుంటే అధికారులకు ముందే సమాచారం ఇవ్వాల్సిందని ఆ వ్యక్తిని ప్రశ్నించారు. కాగా ఈ ఘటనపై అధికారులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
10న బసవణ్ణ, మల్లమ్మ జయంతి
హొసపేటె: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ, సంస్కృతి శాఖ, హొసపేటె మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విశ్వగురు బసవణ్ణ, శివశరణి హేమరెడ్డి మల్లమ్మ జయంతిని ఈనెల 10న సాయంత్రం 6.30 గంటలకు నగరంలోని బసవేశ్వర సర్కిల్లో నిర్వహించనున్నారు. జయంతి నేపథ్యంలో విశ్వగురు బసవణ్ణ ప్రతిమకు పూలమాల వేస్తారు. కార్యక్రమాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ప్రారంబిస్తారు. ఎమ్మెల్యే హెచ్ఆర్.గవియప్ప అధ్యక్షత వహిస్తారు. హంపీ కన్నడ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కే.రవీంద్రనాథ్ ఉపన్యాసం అందిస్తారు. ముఖ్యఅతిథులుగా బళ్లారి ఎంపీ ఈ.తుకారాం, దావణగెరె ఎంపీ డాక్టర్ ప్రభా మల్లికార్జున్, హగరిబొమ్మనహళ్లి ఎమ్మెల్యే కే.నేమిరాజ్ నాయక్, కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ.శ్రీనివాస్, హడగలి ఎమ్మెల్యే డాక్టర్ ఎన్టీ.కృష్ణానాయక్, హరపనహళ్లి ఎమ్మెల్యే ఎంపీ లతా మల్లికార్జున్, జగళూరు ఎమ్మెల్యే బీ.దేవేంద్రప్ప, ఎమ్మెల్సీలు బీ.చంద్రశేఖర్ పాటిల్, శశిల్ నమోషి, వైఎం సతీష్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.రూపేష్కుమార్, హుడా చైర్మన్ హెచ్ఎన్ఎఫ్ ఇమాం నియాజీ, డిప్యూటీ కమిషనర్ ఎంఎస్ దివాకర్, జెడ్పీ సీఈఓ నోంగ్జోయ్ మహ్మద్ అలీ అక్రమ్ షా, జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు, కన్నడ, సంస్కృతి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్ పాల్గొంటారు.

మాక్ డ్రిల్కు ఏర్పాట్లు చేయండి

మాక్ డ్రిల్కు ఏర్పాట్లు చేయండి