
గ్రామీణలో పార్టీని బలపరుద్దాం
రాయచూరు రూరల్: గ్రామీణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సూచించారు. ఆదివారం ఏపీఎంసీ కళ్యాణ మంటపంలో కల్మల బ్లాక్ అధ్యక్షుడిగా రాజశేఖర్ రంగ, దేవసూగూరు బ్లాక్ అధ్యక్షుడిగా నాగేంద్రప్ప అధికారం చేపట్టే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు బీజేపీ విధానాలపై విసిగిపోయారన్నారు. అక్రమాల పుట్ట, కమిషన్ పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారన్నారు. రారష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ జారీ చేసిన పంచ గ్యారెంటీలతో పార్టీకి జెడ్పీ, టీపీ ఎన్నికల్లో విజయానికి బాటలు పడతాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వసంత కుమార్, జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, ఏపీఎంసీ అధ్యక్షుడు మల్లికార్జున గౌడ, బషీర్, పవన్ పాటిల్, అస్లాం పాషా, పంపాపతి, బసవరాజ్లున్నారు.
చలివేంద్రం ప్రారంభం
రాయచూరు రూరల్: నగరంలో ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ వై.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. సోమవారం ఎల్ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. రెండు నెలల పాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలకు దాహార్తి నివారణకు ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి ఏటా రెండు నెలల పాటు తాగునీటిని ఉచితంగా అందిస్తామన్నారు. మేనేజర్లు సుఖేష్, వంశీనాథ్, శివశంకరరావు, సంఘం అధ్యక్షులు శరణేగౌడ, కార్యదర్శి రవి, శ్రీధర్, రాఘవేంద్ర, వీరేష్, లత, జమున, శ్రీశైల, మహంతగౌడలున్నారు.
వేడుకగా సంస్థాపన దినోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా, తాలూకా స్థాయి కన్నడ సాహిత్య పరిషత్ సంస్థాపన దినోత్సవాన్ని జిల్లా కసాప కార్యవర్గం చేపట్టింది. సోమవారం కన్నడ భవనంలో జిల్లాధ్యక్షుడు రంగణ్ణ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక సంఘం 111వ, కన్నడ సాహిత్య పరిషత్ 97వ సంస్థాపన దినోత్సవంలో కర్ణాటక సంఘం అధ్యక్షుడు నరసణ్ణ మాట్లాడుతూ జిల్లా, తాలూకా కసాప రెండు కళ్లువంటివన్నారు. కన్నడ భాషకు ప్రోత్సాహం అందించాలన్నారు. సమావేశంలో బసవరాజ్ పాటిల్, రామకృష్ణ, ఆంజనేయ, ఈరణ్ణ, రామణ్ణ, రావత్రావ్, శ్రీనివాస్, రేఖ, వెంకటేష్ నవలి, దానమ్మ, అయ్యప్ప హుడా, వీర హనుమాన్, బాబు భండారిగల్లున్నారు.
కులగణనలో
భోవి అని రాయించండి
హొసపేటె: భోవి సమాజం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది. ఈ ధృక్కోణం నుంచి, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కులగణనలో ఆ సమాజాన్ని భోవిగా జాబితాలో రాయించాలని భోవి సంఘం విజయనగర జిల్లా సంఘం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నగరంలో సోమవారం అమరావతి మందిరంలో భోవి సమాజ కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రామప్ప మాట్లాడారు. భోవి వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ కులగణనలో పాల్గొనాలి. కుటుంబ సభ్యులందరి వివరాలను అందించాలి. కులగణన జరుగుతున్నప్పడు మనం మన గ్రామాలను వదిలి వెళ్లకూడదు అని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చిన భోవితో సహా వివిధ వర్గాలకు జనాభా ప్రకారం అంతర్గత రిజర్వేషన్లు పంపిణీ అవుతాయన్నారు. సరైన సమాచారం అందించాలని ఆయన సూచించారు. కమిటీ నేతలు, సభ్యులు పాల్గొన్నారు.
మార్కెట్లో బెమెల్ సాధన భేష్
కేజీఎఫ్ : బెమెల్(బీఈఎంఎల్) సంస్థ బలహీన మార్కెట్ నడుమ కూడా ఉత్తమ సాధన చేసిందని బెమెల్ ఎండీ శాంతను రాయ్ తెలిపారు. సోమవారం బెమెల్ ఆర్ అండ్ డీ విభాగంలో నిర్వహించిన దేశంలోని 170 ప్రముఖ అధికారుల స్ట్రాటజిక్ మీట్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రత్యేక ఆహ్వానితుడు ఉజ్వల్ కాంతి భట్టాచార్య, అడ్మిరల్ కరంబీర్ సింగ్, బెమెల్ కేజీఎఫ్, మైసూరు, బెంగళూరు, కేరళ, పాలక్కాడ్కు చెందిన బెమెల్ విభాగం ప్రముఖులు పాల్గొన్నారు.

గ్రామీణలో పార్టీని బలపరుద్దాం

గ్రామీణలో పార్టీని బలపరుద్దాం

గ్రామీణలో పార్టీని బలపరుద్దాం